Friday, May 3, 2024

కుతూహలమ్మ మృతి బాధాకరం … చంద్రబాబు

మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అకాల మరణం బాధాకరమ‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు అన్నారు. జెడ్పీ ఛైర్ పర్సన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవులు అధిరోహించి మహిళల అభ్యుదయాన్ని చాటి చెప్పారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమ‌న్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఆమె ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. కుతూహలమ్మ మృతికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement