Saturday, April 20, 2024

కొండగట్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. బుధవారం ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్ ద్వారా కొండగట్టులోని జేఎన్టీయూ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు వచ్చిన సీఎం కేసీఆర్ కు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవితతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లు పుష్పచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండగట్టు మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement