Thursday, May 2, 2024

AP: కర్నూల్‌లో వాహానాల తనీఖీలు…భారీగా బంగారం, వెండి, న‌గ‌దు స్వాధీనం

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు క్రిష్ణగిరి మండలం, అమకతాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పై ఉన్న టోల్ ప్లాజా వద్ద కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అధికారుల సమాచారంతో హైదరాబాదు నుండి కోయంబత్తూరు వెళుతున్న ఎన్ ఎల్ 01 ఎం 2506 సురేష్ స్వామి అయ్యప్ప ప్రవేట్ స్లీపర్ ఏసి ట్రావెల్స్ బస్సులో నలుగురు వ్యక్తుల వద్ద నుండి బంగారం , వెండి తో పాటు భారీగా నగదు ను వెల్దుర్తి సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

నంద్యాల టౌన్ కు చెందిన అమర్ ప్రతాప్ పవర్ అతని వద్ద కోటి 20 లక్షల 80 వేల నగదు, ఇక తమిళనాడు కోయంబత్తూర్ కి చెందిన వెంకటేష్ రాహుల్ వద్ద నుంచి 3 కేజీల195 గ్రాముల బంగారం, రూ. 19.23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తమిళనాడు కోయంబత్తూర్ చెందిన సెంథిల్ కుమార్ వద్ద రూ.44.50 లక్షల నగదు, 1 కేజీ 37 గ్రాముల బంగారు స్వాధీన పర్చుకోవడం జరిగింది. ఇక శబరి రాజన్ అనే వ్యక్తి వద్ద 5 కేజీల వెండి బిస్కెట్లు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏలాంటి పత్రాలు లేని 5 కేజీల వెండి బిస్కెట్లు, 4 కేజీల 232 గ్రాముల బంగారం,ఒక కోటి 84 లక్షల 53 వేల,500 రూపాయల నగదు సీజ్ చేశారు. మొత్తం పట్టుబడిన బంగారం, వెండి, నగదు మొత్తం విలువ రూ. 4 కోట్ల 59 లక్షల 8 వేల 3 వందలు చేస్తుందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. వాటిని పంచాయతీ దారుల సమక్షంలో పంచనామా రాసి, వాటికి సరిపడా ఆధారాలు చూపుట కొరకు విజయవాడ ఆదాయపు పన్ను శాఖ వారికి పోలీసులు లేఖ రాశారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్ పోలీసులను, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ వాహన తనిఖీల్లో వెల్దుర్తి సీఐ సురేష్ కుమార్ రెడ్డి, వెల్దుర్తి ఎస్సై పి చంద్రశేఖర్ రెడ్డి, క్రిష్ణగిరి ఎస్సై ఎం చంద్రశేఖర్ రెడ్డి , వెల్దుర్తి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement