Sunday, May 5, 2024

Cannabis: గంజాయి స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డ్డ ఏపీ కానిస్టేబుల్స్‌…. ప‌ట్టుకున్న తెలంగాణ పోలీసులు

హైద‌రాబాద్‌లో ఏపీకి చెందిన ఇద్ద‌రు కానిస్టేబుళ్లు గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ దొరికారు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామునా బాచుప‌ల్లిలో కారులో గంజాయి తరలిస్తుండ‌గా, ముందస్తు సమాచారం అందడంతో వారిని బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలో గంజాయి అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఓ కారులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విస్తుపోయే విషయం బయటపడింది. వారిద్దరూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన వారని, కాకినాడలో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారని తేలింది. విధులకు సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిద్దరినీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement