Friday, May 17, 2024

Kurnool: ఓర్వకల్లులో దొంగల బీభత్సం

కర్నూలు జిల్లా, ఓర్వకల్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఓర్వకల్లో నివాసం ఉంటున్న వన్నూరు సోమన్న ఇంటిలో బీరువా పగలగొట్టి 14 తులాల బంగారం, రూ.75 వేల నగదు దోచుకెళ్ళారు. ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement