Wednesday, May 1, 2024

ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కాలువ‌లో తోసేసిన తండ్రి..!

కర్నూలు జిల్లాలోని కోడుమూరు గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి ఆటోతో సహ ప్యాలకుర్తి వద్ద కాలువలో పడేసి అక్కడి నుంచి పారి పోయాడు. ఆ సమయంలో నీరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement