Thursday, May 9, 2024

దివ్యాంగుల‌కు కృత్రిమ అవ‌య‌వాలు పంపిణీ చేసిన టీజీ భ‌ర‌త్

కర్నూలు : భార‌త్ వికాస్ ప‌రిష‌త్ ద్వారా ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని టీజీవీ సంస్థల జూనియ‌ర్ చైర్మ‌న్ టీజీ భ‌ర‌త్ అన్నారు. శ‌నివారం న‌గ‌రంలోని బుధవార పేట కేశ‌వ మెమోరియ‌ల్ స్కూల్ లో దివ్యాంగుల‌కు ఉచిత కృత్రిమ అవ‌య‌వాల పంపిణీ కార్యక్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా దివ్యాంగులైన 110 మందికి టీజీ భ‌ర‌త్ చేతుల మీదుగా కృత్రిమ అవ‌య‌వాలు పంపిణీ చేశారు.

టీజీ భ‌ర‌త్ మాట్లాడుతూ భార‌త్ వికాస్ ప‌రిష‌త్ తుంగ‌భ‌ద్ర శాఖ ఆధ్వ‌ర్యంలో ఇంత గొప్ప కార్య‌క్ర‌మం చేయ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేయాల‌ని సంస్థ స‌బ్యుల‌కు చెప్పారు. త‌మ టీజీవీ సంస్థ‌ల త‌రుపున ఎలాంటి స‌హాయం కావాల‌న్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని భ‌ర‌త్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ప్రాంత అధ్య‌క్షుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ప్రాజెక్ట్‌ క‌న్వీన‌ర్ బాల‌కృష్ణ‌, బ్రాంచ్ ప్రెసిడెంట్ దత్త‌య్య‌, వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, సెక్ర‌ట‌రీ అమ‌ర‌నాథ్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ స‌తీష్‌, కోశాధికారి సుబ్ర‌హ్మ‌ణ్యం, త‌దితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement