Thursday, May 2, 2024

KNL: పాఠశాలలో జెండా కర్ర తీస్తుండగా.. విద్యార్థులకు కరెంట్ షాక్

పాఠ‌శాల‌లో జాతీయ జెండా తీస్తుండగా విద్యార్థుల‌కు క‌రెంట్ షాక్ కొట్టింది. ఈ ఘ‌ట‌న ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది. మంగళవారం ఉదయం వెస్లీ పాఠశాలలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానిక నెహ్రు మెమోరియల్ పాఠశాలలో ప‌దో తరగతి చదువుతున్న దీపక్, మణికంఠ ట్యూషన్ కోసం వెస్లీ పాఠశాలకు వెళ్లారు. అయితే.. ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగరవేయడానికి ఏర్పాటుచేసిన పైపు తో పాటు జెండా తీయడానికి ఇద్దరు విద్యార్థులు యత్నిస్తుండగా సమీపంలోని విద్యుత్ తీగలకు తాకింది. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు షాక్‌కి గుర‌య్యారు. కాళ్లు చేతులకు తీవ్ర గాయాల‌య్యాయి. చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement