Thursday, April 18, 2024

బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం-తెలుగు రాష్ట్రాల‌పై ప్ర‌భావం

ఈ నెల 19న బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్పడే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాపై ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోందని చెప్పింది. తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉండొచ్చని వెల్లడించింది. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement