Saturday, April 27, 2024

కర్నూలులో మరో దారుణహత్య

వరుస హత్యలతో కర్నూలు జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా జిల్లాలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల వైఎస్ఆర్ నగర్‌లో జగన్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement