Wednesday, May 1, 2024

రాఘవుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

మంత్రాలయం, ఫిబ్రవరి,25, (ప్రభ న్యూస్ ):. శ్రీ రాఘవేంద్ర స్వామి గురవైభవోత్సవాలు పురస్కరించుకుని కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అనిల్ బి కట్టి, బాంబే హైకోర్టు న్యాయమూర్తి శ్రీ రామ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవి చీమలపాటి వేరు వేరుగా వచ్చారు. వారికి ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్, మఠం అధికారులు ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వారు గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను దర్శించుకుని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు శేష వస్త్రం ఫల మంత్రాక్షికలు ఇచ్చి ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement