Tuesday, April 23, 2024

శ్రీ రాఘవేంద్రుని 428వ జన్మదిన వేడుకలకు సర్వం సిద్దం

మంత్రాలయం, ఫిబ్రవరి,25,( ప్రభ న్యూస్ ): తుంగా తీరంలోని మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల 428వ జన్మదిన వేడుకలు ఆదివారం కన్నుల పండువగా జరుగునున్నాయి. ఆరవ రోజు గురువైభోత్సవాలను పురస్కరించుకొని, పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు నేతృత్వంలో జరిగే జయంతి వేడుకలు సందర్భంగా స్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీ రాఘవేంద్ర స్వామి పుట్టిన రోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను స్వామి నిజ మూల బృందావనానికి సమర్పించడం ఆనవాయితీ. అనంతరం స్వర్ణ రథోత్సవంలో శ్రీ రాఘవేంద్రుని ప్రతిమను ఉంచి మఠం ప్రాకారంలో అశేష జనాల మధ్య ఊరేగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement