Sunday, May 5, 2024

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద‌.. ప‌ది గేట్లు ఎత్తివేత‌…

ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌తో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 3,52,105 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 4,40,810 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 884.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 214.3637 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement