Thursday, April 25, 2024

ముదిరాజుల అభివృద్ధికి పెద్ద‌పీట : మంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మాదన్న పేట చెరువులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ గోపిలు చేప పిల్లలు వదిలారు. నీరు ఎక్కువగా ఉన్నపుడు చాపలు పట్టేలా సాంకేతిక నైపుణ్యాన్ని అలవరుచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజుల అభివృద్ధికి ఎక్కడ లేని విధంగా రాష్టం సహకరిస్తుందని అన్నారు. చేపలలో ఉన్న ప్రొటీన్లు వేరే మాంసంలో లేవ‌న్నారు. ఎక్కడ వీలైతే అక్కడ సొసైటీలు ఏర్పాటు చేయాలని, తద్వారా అందరికీ ఆరోగ్య వంతమైన ఆహారం అందుతుందని అన్నారు. అందరూ సహకరిస్తే ఎగుమతులు కూడా ప్రారంభం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement