Wednesday, May 8, 2024

రేపు ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికల పోలింగ్‌

క‌ర్నూల్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాష్ట్ర డెలిగేట్ల ఓటింగ్ కు కర్నూలు జిల్లా వేదిక కానుంది. 17న కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటు హక్కు పీసీసీ డెలిగేట్లు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది పీసీసీ డెలిగేట్లు ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు కర్నూలుకు తరలిరానున్నారు. 22 సంవ‌త్స‌రాల తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లి ఖార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్న సంగతి విదితమే. 17 ఓటింగ్ సందర్భంగా భారత జోడో యాత్రకు రాహుల్ విరామం ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఎన్నికలకు సoబందించి 19న కౌంటింగ్.. అదే రోజు ఫలితం ప్రకతించనున్నారు. 1962 నుండి 64 వరకు, 1971 నుండి 72 వరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు కర్నూలు జిల్లా వాసి దామోదరం సంజీవయ్య చేప‌ట్టినారు. ఏఐసీసీ అధ్యక్ష పదవిలో ఉండగానే దామోదరం సంజీవయ్య కన్నుమూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement