Saturday, May 4, 2024

గ్రామాల అభివృద్ధే ల‌క్ష్యం : మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం

కర్నూలు జిల్లా ఆలూరు తాలుక ఆస్పరి మండల పరిధిలోని చిన్నహోతూరు గ్రామంలో గడప గడపకు వైసీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ముందుగా మంత్రి చిన్న హోతూరు గ్రామ సచివాలయ భవనాన్ని ఆ గ్రామ సర్పంచ్ హరికృష్ణ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ గ్రామానికి జగనన్న రూ.ఏడు కోట్లు ఖ‌ర్చు చేయడం జరిగిందని, అదనంగా గ్రామ సమస్యలు పరిష్కరించుకోవడానికి రూ.20 లక్షల మీ గ్రామానికి ఇవ్వబోతున్నట్లు, ఎస్సీ కాలనీకి సంబంధించిన వాటర్ పైప్లైన్ లకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూ.10 లక్షలతో డ్రైనేజీ పరిష్కారానికి ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement