Saturday, May 4, 2024

మేకపాటి గౌతమ్ రెడ్డికి కౌన్సిల‌ర్ల సంతాపం

నందికొట్కూరు : పట్టణంలోని జైకిసాన్ పార్కులో గురువారం మున్సిపాలిటీ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశానికి ముందుగా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఆయన మృతి రాష్ట్ర ప్రజానీకానికి తీరనిలోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లు అర్షపోగు ప్రశాంతి, కో- ఆప్షన్ సభ్యులు డి.సుశీల భాగ్యమ్మ, కేశవరెడ్డి శ్రీనివాస రెడ్డి, అబ్దుల్ గఫార్, కౌన్సిలర్ లు అబ్దుల్ హమీద్, చాంద్ భాష, కాటెపోగు చిన్న రాజు, అబ్దుల్ రవూఫ్, షేక్ నాయబ్, అల్లురి క్రిష్ణ, లాలు ప్రసాద్, చెరుకు సురేష్, మనపాడు అశోక్, మందడి వాణి, యం.సమీర భాను, కొండ్రెడ్డి విజయమ్మ, జె.రాధిక, షేక్ రేష్మ‌‌‌, యం.కరీష్మా, యం.లక్ష్మిదేవి, వీరబొమ్మ రూపాదేవి, చింత లక్ష్మిదేవి, పి.శాంత కుమారి, కె.క్రిష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement