Saturday, May 18, 2024

సమస్యలు లేని గ్రామాలుగా చూడటమే లక్ష్యం: జెడ్పీ చైర్ పర్సన్

అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దిటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని జడ్పీ చైర్ పర్సన్ పిరియ విజయ సాయిరాజ్ పేర్కొన్నారు. తీర ప్రాంత గ్రామం అయిన ఇసుకుల పాలెం గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా ? అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై అరా తీశారు. అనంతరం బీచ్ నుండి ఇసుకలపాలెం గ్రామ సచివాలయం వరకు ఎనిమిది లక్షల నిధులుతో ఏర్పాటు చెయునున్న సి.సి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement