Thursday, May 2, 2024

రేపు నంద్యాల జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..

కర్నూలు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటించనున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. 10.15 గంటలకు ఆళ్ళగడ్డ చేరుకుంటారు. 10.45 – 12.10 గంటలకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ రెండో విడత నగదు బదిలీని బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement