Wednesday, May 1, 2024

కర్నూలు జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేటి నుంచి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement