Thursday, April 25, 2024

జగన్ మోసం..రోడ్డున పడ్డ షర్మిల..’చంద్రబాబు’

కర్నూలు – ఏపీ సీఎం జగన్ తన సోదరినే మోసం చేశారని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. కర్నూలులో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం వద్దకు చేరుకుని పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు సాగిన రోడ్‌షోలో పాల్గొన్నారు  చెన్నమ్మసర్కిల్‌ వద్ద చైతన్య రథం నుంచి ప్రజలనుద్దేశించి  చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడ్డారని .. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు.  జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు.  టీడీపీ హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే జగన్‌ మాత్రం విధ్వంసానికి పెద్దపీట వేశారని  ఆక్షేపించారు.  పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైసీపీ నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా? ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?’ అని ప్రశ్నించారు. వైకాపా పాలనతో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడు చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement