Friday, May 3, 2024

గంజాయి పట్టివేత : మహారాష్ట్ర వాసి అరెస్ట్

కర్నూల్ పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద ఈరోజు ఎస్ఈబీసీఐ మంజుల, యస్ ఐ గోపాల్ , సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం, షోలాపూర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రంకు చెందిన షేక్ మైనుద్దీన్ జాఫర్ (24సం) అనే వ్యక్తి హైదరాబాదు నుండి బెంగళూరు వెల్లే గరుడ బస్సులో ప్రయాణిస్తూ బ్యాగులో సుమారు ఒక కిలో కు పైగా గంజాయి రవాణా చేస్తూ తనిఖీల్లో చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డాడు. సదరు వ్యక్తిని, పట్టుబడిన గంజాయిని కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం తరలించారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్స్ ఖాజా, మహమ్మద్, వెంకటేష్, కానిస్టేబుళ్లు నారాయణ, మురలి ఎస్ పి ఓ పరశురామ్, సుందర్, సుంకన్న, విజయ భాస్కర్ లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement