Thursday, May 2, 2024

గ్రామ సచివాలయంలో చోరీ

నంద్యాల జిల్లా : పాణ్యం నియోజకవర్గ కేంద్రంలోని మూడు సచివాలయాల్లో దొంగల చోరీకి పాల్ప‌డ్డారు. గురువారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ కార్యాలయం, సచివాలయం 2, 4, తాళాలు పగలగొట్టి లోపల ఉన్న ప్రభుత్వ టేబుళ్లను చిందర వందర చేసి, కాగితాలను చించి, బీభత్సం చేశారు. సిసిఎస్ సిఐ రామకృష్ణ సిబ్బందితో పరిసరాలను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం రంగ ప్రవేశం చేసి దొంగలు బీభత్సం చేసిన పరిసరాలలో గుర్తించిన వస్తువులను, పరిసరాలను గుర్తింపు ఆధారాలుగా నమోదు చేసుకొని వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement