Sunday, May 5, 2024

బీజేపీ, బజరంగ్‌ద‌ళ్ శాంతియాత్ర.. అక్ర‌మ కేసుల‌ను ఎత్తేయాల‌ని డిమాండ్‌

కర్నూలు జిల్లా హొళగుంద గ్రామంలో హిందువులు పవిత్రంగా భావించే ఆంజనేయస్వామి జయంతి రోజున “వీరహనుమాన్ విజయ యాత్ర” నిర్వహించగా స్థానిక మసీదు నుండి దుండగులు ఒక్కసారి చెప్పులు, రాళ్ళు, ఆయుధాలతో దాడిచేశార‌ని బీజేపీ, బ‌జ‌రంగ్ ద‌ళ్ నేత‌లు అన్నారు. అనుకోకుండా వచ్చిన ఈ హఠాత్పరిణామానికి బ‌యపడిన చాలామంది దిక్కుతోచక అటూ ఇటూ పరిగెత్తి ప్రాణాలను కాపాడుకున్నార‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో చాలామంది గాయ‌ప‌డ్డ‌ట్టు తెలిపారు. కాగా, బజరంగ్‌ద‌ళ్‌ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా హొళగుందలో హనుమజ్జయంతి సందర్భంగా దాడిచేసిన వారితో పాటు.. దాడికి గురై బాధపడుతున్న 40 మంది అమాయకుల‌పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమ‌న్నారు. ప్రభుత్వం ఈ కేసులను ఎత్తివేయాలనీ డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement