Tuesday, April 30, 2024

Breaking: ఎలుగుబంటి దాడి.. రైతుకు తీవ్రగాయాలు

పొలంలో ఎలుగుబంటి దాడి చేయడంతో రైతు తీవ్రంగా గాయపడిన ఘటన నంద్యాల జిల్లాలోని పాములపాడు మండలంలోని ఎర్రగూడూరులో చోటుచేసుకుంది. సాంబ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేయడంతో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ రైతును ఆస్పత్రికి తరలించారు. ఎనిమిదినెలలుగా ఎలుగుబంటి పొలాల్లో తిరుగుతోంది. ఎలుగుబంటి తిరుగుతుందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటి దాడి చేయడంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement