Sunday, April 28, 2024

KNL: రైలు కిందపడి యువకుడి మృతి

కర్నూలు: జిల్లాలోని మద్దికెర రైల్వే స్టేషన్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఇవాళ ఉదయం రైలు కిందపడి ఓ యువకుడు చనిపోయాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మద్దికెరకు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్(25)గా గుర్తించారు.

పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన యువకుడు కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement