Monday, May 6, 2024

రైతుల పొట్ట కొట్టే హెచ్ సి పి ఎల్ గ్యాస్ పైప్ లైన్లు ఆపాలి – డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్

క‌ర్నూలు – రైతుల పొట్ట కొట్టే హెచ్పిసి పి ఎల్ గ్యాస్ పైప్ లైన్ ను వెంటనే ఆపాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ డిమాండ్ చేశారు. రైతుల సామూహిక దీక్షలకు ఏడవ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన నగేష్ మాట్లాడుతూ రైతుల పొలాల్లో వారికి నచ్చిన పంటలు వేసుకోవడానికి అవకాశం లేనటువంటి హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులకు హెచ్పిసిఎల్ సంస్థ వారు ఇచ్చిన నోటీసుకు రిప్లై ఇస్తూ ఇచ్చిన అభిప్రాయాన్ని గౌరవించకుండా అక్రమంగా పంటలను నాశనం చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, నష్టపోయిన రైతుల పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే డివైఎఫ్ఐ గా యువతీ యువకులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్య‌క్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర అబ్దుల్లా కర్నూల్ మండల కార్యదర్శి ప్రకాష్ కిషన్ రైతులు మాధవరెడ్డి వెంకటయ్య తిరుపాలు వెంకట కృష్ణారెడ్డి రోగేన్న దుబ్బన్న చిన్న మాదన్న మధు కాసిం బజారి లక్ష్మణ్ శివన్న మద్దిలేటి ఎల్లప్ప మహిళ రైతు ఎర్రమ్మ మరో 27 మంది రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement