Thursday, April 25, 2024

యువత క్రీడల్లో రాణించాలి – ఎంపీపీ సంతోషం రమాదేవి

నెన్నెల, : మండలంలోని యువత క్రీడల్లో రాణించాలని ఎంపీపీ సంతోషం రమాదేవి అన్నారు. ఆవడం గ్రామంలోని యువతకు గురువారం రోజున ఎంపీపీ సంతోషం రమాదేవి-ప్రతాప్‌రెడ్డి క్రికెట్‌ కిట్లతో పాటు టీషర్ట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడల్లో రాణించాలని, క్రీడల వల్ల శారీరక దారుడ్యం పెరగడంతో పాటు మానసిక ఉల్లాసం కల్గుతుందని, స్నేహ సంబంధాలు మెరుగుపడుతాయని అన్నారు. క్రీడానైపుణ్యం కల్గిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కూడా లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శీల సత్తమ్మ-మొండన్న, ఉప సర్పంచ్‌ కిరణ్‌, మాజీ ఎంపీటీసీ తిరుపతి, ప్రతాప్‌ రెడ్డి, పాపయ్య, రాజ్‌రెడ్డి, పద్మభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement