Saturday, May 4, 2024

ఓటు వేసిన అనంత‌రం మ‌ర‌ణించిన వృద్ధురాలు..

ఎమ్మిగనూరు –  85 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి ఇంటికొచ్చి మృతి చెందింది. ఎమ్మిగనూరు పట్టణం ఇందిరా నగర్‌కు చెందిన వడ్డే లక్ష్మమ్మ (85) తన కోడలితో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొని వచ్చి కన్నుమూశారు. బుధవారం స్థానిక మాచాని సోమప్ప జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లోఉదయం 10 గంటల సమయంలో లక్ష్మమ్మ తన కోడలితో కలిసి వెళ్లి ఓటు వేసింది. అనంతరం ఇంటికి వెళ్ళింది. కాలనీలో అందరిని ఆప్యాయంగా పలకరించింది. ఉన్నట్టుండి గొంతులో గళ్ళ అడ్డంగా పడినట్లు ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో మంచి నీళ్ళు తాగించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా మాట రాక అల్లాడిపోయి లక్ష్మమ్మ తుదిశ్వాస విడిచారు.లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. భర్త 20 ఏళ్ల కిందట మరణించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువ తెలిసిన లక్ష్మమ్మ తన వయోభారంలో కూడా ఓటు హక్కు వినియోగించుకొని మరణించడం పలువురిని కంటతడి పెట్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement