Tuesday, April 23, 2024

విజ‌య‌న‌గ‌రంలో బొత్స ఓటింగ్…. జిల్లాలో 1 గంట వ‌ర‌కు 46.46 శాతం పోలింగ్..

విజ‌య‌న‌గ‌రం – జిల్లాలో మునిసిప‌ల్ పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న‌ది… మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి జిల్లాలో 46.46 శాతం పోలింగ్ న‌మోదైంది.. కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ తన ఓటు హక్కు వినియోగించు​కున్నారు. మహారాజా కళాశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్‌లో విజయం సాధించిన అభ్యర్థులు మరింత బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పట్టణాభివృద్దికి తమ వంతు కృషి ఎప్పుడూ ఉంటుందన్నారు.
జిల్లాలో మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పోలింగ్ వివ‌రాలు..

  1. విజయనగరం… 41.58%
  2. పార్వతీపురం.. 52.39%
  3. బొబ్బిలి… 54.86%
  4. సాలూరు.. 52..27%
  5. నెల్లిమర్ల. 56.75%
Advertisement

తాజా వార్తలు

Advertisement