Saturday, April 27, 2024

AP : సుంకీ అటవీ ప్రాంతంలో కూబింగ్ …. మావోల‌ ఆయుధాల త‌యారీ కేంద్రం గుర్తింపు…

మన్యం జిల్లా పార్వతీపురం ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) మావోస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భ‌ద్ర‌తా ద‌ళాలు కూబింగ్ నిర్వ‌హించాయి. పార్వతీపురం పరిధిలోని సుంకీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఈ విష‌యాన్ని బెటాలియన్ కమాండ్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ సందీప్ కెర్‌కెట్టా తెలిపారు.

మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంతాం బడేవలస, పద్మాపురం గ్రామాలకు మూడు, 4 కి.మీటర్ల దూరంలో ఉంది. కూంబింగ్‌లో భాగంగా భద్రతా దళాలు హేండ్‌ బౌలర్‌, టిగ్గర్‌ మెకానిజం, ఫిల్లర్లు, హేమర్‌, స్లీపర్‌, చేజల్‌, ఫైల్‌, కత్తులు, ఇనుప బిట్లను సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement