Monday, April 29, 2024

AP | దుర్గ‌ గుడి నూతన ఈవోగా కెఎస్ రామారావు.. తక్షణమే విధుల్లో చేరాల‌ని ఉత్తర్వులు

ఎన్టీఆర్ బ్యూరో, (ప్రభ న్యూస్) : విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ఈవోగా కేఎస్ రామారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈవోగా బాధ్యతలు నిర్వహించిన భ్రమరాంబను బదిలీ చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దుర్గగుడి ఈవోగా శ్రీనివాసరావు ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన విధుల్లోకి చేరకపోవడంతో బదిలీల్లో మార్పు చేసింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డిఓగా పనిచేస్తున్న కే ఎస్ రామారావు తక్షణమే ఈవోగా బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదివారం తాజాగా ఉత్తరవులను జారీ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement