Saturday, May 4, 2024

ఉయ్యూరులో లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ వీఆర్వో

ఉయ్యూరు, (ప్రభ న్యూస్​) : నగర పంచాయతీ ఏడో సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వెటర్నరీ హాస్పిటల్ రోడ్ లోని ఏడో వార్డు సచివాలయ వీఆర్వో మహ్మద్ అక్హిల్ ఇన్కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు కర్రే అనిల్ కుమార్ నుంచి 5వేలు డిమాండ్ చేశాడు. అతనికి 3వేలు ఇవ్వగా కుటుంబ ఆస్తి బదలాయింపు వ్యవహారంలో 20వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అంత మొత్తం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించగా.. తీసుకున్న మొత్తం లో అర్ఐ వాటా, ఎంఆర్ ఓ వాటా, ఆఫీస్ ఖర్చులు పోనూ తనకు మిగిలేది ఏమీ లేదని వీఆర్వో చెప్పాడు. దీంతో 5 వేల రూపాయలు ఇచ్చినప్పటికీ తన పని చేయకుండా పలుమార్లు తిప్పించుకోవడంతో విసుగు చెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం సచివాలయ ఉద్యోగి 2 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement