Wednesday, May 1, 2024

కుంగుతున్న రహదారి.. వాహ‌న‌దారుల‌కు ఇక్క‌ట్లు..

కోడూరు (అవనిగడ్డ నియోజకవర్గం): కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారి కుంగిపోతుంది. జయ పురం- వి కొత్తపాలెం గ్రామాల మధ్య రహదారి పక్కన కోతగురి విరిగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ప్రయాణికులు గురవుతున్నారు. ఇప్పటికే కోడూరు అవనిగడ్డ రహదారి గుంతలయ‌మైంది.

కొన్నిచోట్ల మరమ్మతులు చేశారు. వర్షాకాలం ప్రారంభమైన ఉన్న గుంతల్లోకి నీరు చేరుకుని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ప్రధాన రహదారి కోతకు గురవుతున్నది. రహదారి మొత్తం చేయకుండా కొన్ని చోట్ల మరమ్మతులు చేయడం అట్ల ప్రయాణికులు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన గుంతలను మరమ్మతులు చేయకుండా చిన్నచిన్న గుంతలు మరమ్మత్తులు చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement