Tuesday, April 23, 2024

గుంటూరులో కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్రగాయాలు

గుంటూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపక్కన రిక్షాలు, పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారు నడిపింది.. ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement