Thursday, May 2, 2024

శ్రీ తిరుపతమ్మ తిరునాళ్ళు ప్రారంభిస్తున్న – చైర్మన్, ఈవో

పెనుగంచిప్రోలు (ప్రభ న్యూస్) : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లు మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ముందుగా ఆలయ ప్రధానార్చకులు రమణ పురోహితులు ఆంజనేయ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి శోభారాణి, చైర్మన్ చెన్నకేశవలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తిరుణాల ప్రారంభించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ని పలు జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement