Tuesday, April 30, 2024

చ‌లివేంద్రాన్ని ప్రారంభించిన సీఐ

తిరువూరు : కృష్ణా జిల్లా తిరువూరులో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్ చలివేంద్రాన్ని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వనజ మెస్ పక్కన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పానకం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంత‌రం సీఐ మాట్లాడుతూ సొసైటీ ఆధ్వ‌ర్యంలో ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు మ‌రెన్నో చేయాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు విపత్తుల నిర్వహణ కమిటీ సామర్ల మల్లికార్జున రావు కొండవీటి ఈశ్వర్ రావు రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement