Friday, June 14, 2024

AP : జగన్మాత సేవలో చాగంటి

ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ః విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని జగన్మాతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానంకు శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, కుటుంబసభ్యులతో రాగా ఆలయ కార్యనిర్వాహణాధికారి కెఎస్. రామరావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు.

- Advertisement -

అనంతరం వీరికి ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు అమ్మవారి ప్రసాదములు, పండ్లు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. ‘శ్రీ కనకదుర్గ వైభవం’ పుస్తకంను గురించి ఈవో చాగంటి వారికి వివరించారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయంను, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆలయమును దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement