Thursday, June 6, 2024

AP: గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొని… ముగ్గురు మృతి

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘ‌ట‌న‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై ఇవాళ‌ ఉదయం చోటుచేసుకుంది. ఉంగరాని గుండ్ల గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ముని, ప్రభాకర్, దశరథ‌గా గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement