Thursday, May 2, 2024

ఆటో – టిప్పర్ ఢీః ముగ్గురు దుర్మరణం

గుడ్లవల్లేరు – జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలో తెల్లవారుజామున జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.పెడన మండలం గౌడపాలెం జింజేరు నుండి శనివారం రాత్రి 12.30 ని. లకు కుప్పల పనికి వెళ్తున్న కూలీల ఆటో ని గుడ్లవలేరు మండలం రెడ్డి పాలెం సమీపంలో టిప్పర్ డి కొట్టింది ఆటోలో డ్రైవరు తో సహా 12 మంది ఉన్నారు . ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మిగిలిన 9 మందికి గాయాలు అయ్యాయి వారిని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో మోతుకురి శివ, జన్ను నాంచారయ్య, జన్ను వెంకన్న చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement