Wednesday, May 15, 2024

వైసిపికి చిక్కిన విజ‌య‌వాడ కార్పొరేష‌న్….

విజ‌య‌వాడ – విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క‌సంస్థ ఎన్నిక‌ల‌లోనూ తెలుగుదేశం పార్టీకి శృంగ‌భంగమైంది..వైసిపి, టిడిపిలు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ న‌గ‌ర పాల‌క‌సంస్థ ఎన్నిక‌ల‌లో ఫ్యాన్ పై చేయి సాధించింది.. 64 డివిజ‌న్ ల‌కు ఈ కార్పొరేష‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కు వైసిపి 32 స్థానాల‌లో విజ‌యం సాధించ‌గా మ‌రో 6 స్థానాల‌లో ఆధీక్యంలో కొన‌సాగుతున్న‌ది.. టిడిపి 14 స్థానాల‌లో గెలుపొంద‌గా, మ‌రో 4 స్థానాల‌లో ఆధీక్యంలో ఉంది.. మ‌రో ఎనిమిది చోట్ల ఇరు పార్టీల మ‌ధ్య అధీక్య‌త మారుతూ వస్తున్న‌ది.. ఇప్ప‌టికే వైసిపి మ్యాజిక్ ఫిగ‌ర్ 33కి చేరుకోవ‌డంతో విజ‌య‌వాడ‌లో వైసిపి శ్రేణులు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నాయి.. కాగా తెలుగుదేశం త‌న ఓట‌మిని అంగీక‌రించింది… వైసిపి గెలుపును స్వాగ‌తిస్తూనే ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల గురి చేసి విజ‌యం సాధించారంటూ టిడిపి నేత‌లు వ్యాఖ్యానించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement