Monday, May 20, 2024

లడ్డూ తయారీ కేంద్రంలో పేలిన గ్యాన్ స్టవ్

 విజయవాడ : లడ్డూ తయారీ కేంద్రంలో గ్యాస్ స్టవ్ పేలింది. ఈ సంఘటన విజయవాడ ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ ఆలయంలో చోటు చేసుకుంది. లడ్డు తయారు చేస్తున్న సమయంలో పొయ్యి ఒక్కసారిగా పేలడంతో లడ్డు తయారీ కార్మికులు భయబ్రాంతులకు గురయ్యారు. పొయ్యి పేలిన ఘటనలో దుర్గా అనే కార్మికురాలికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే ఈవో సురేష్‌ బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ…  గ్యాస్ పొయ్యి పైపు లీక్ అవడంతో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వెంటనే స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారని తెలిపారు. స్వల్ప గాయాలైన మహిళకు ప్రథమ చికిత్స చేశారని, తిరిగి విధుల్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఎటువంటి నష్టం కానీ జరగలేదన్నారు.  వెంటనే పొయ్యిల పనితీరును పరిశీలించాలని సిబ్బందికి సూచించామని ఈవో సురేష్‌ బాబు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement