Monday, April 29, 2024

AP | ప్రముఖ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట..

అమరావతి,ఆంధ్రప్రభ ; పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి తెలిపారు. కొండవీడు కోట ఇకో టూరిజం పార్కు సహా ఇతర అభివృద్ధి పనులపై శుక్రవారం విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

13,14వ శతాబ్దాలకు చెందిన ఈకొండవీడు కోటను దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే రీతిలో పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకూ చేపట్టిన అప్రోచ్‌ రోడ్డులు సహా ఇతర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి, ఆర్కియాలజీ, దేవాదాయ, అటవీ శాఖల అధికారులను సిీఎస్‌ ఆదేశించారు. అదే విధంగా పర్యాటకులకు కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు వంటి వస్తువులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సిఎస్‌ ఆదేశించారు.

- Advertisement -

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న లక్ష్మి నర్సింహ స్వామి దేవాలయం ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శివాలయం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సిఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశించారు. సాయంత్రం వేళల్లో సందర్శకులు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే రీతిలో కోట ఆవరణలో సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సిఎస్‌ పేర్కొన్నారు.

అదే విధంగా కోట చుట్టూ లోపల వెలుపల పెద్ద ఎత్తున సుందరీకరణతో పాటు వెలుపల పార్కులు, ల్యాండ్‌ స్కెపింగ్‌ వంటివి అభివృద్ధి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు వై.మదుసూదన్‌ రెడ్డి, వాణీమోహన్‌, కె.కన్నబాబు, ఎస్‌.సత్య నారాయణ, నయీముల్లా, శివారెడ్డి, శ్రీనివాస రెడ్డి, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ క‌న్వీనర్‌ కె.శివారెడ్డి, డిఎఫ్‌ఓ రామచంద్ర రావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement