వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేసుకోవడానికే కోనసీమ గొడవ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమలాపురంలో అల్లర్లపై ఆయన స్పందించారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… ఈ సమయంలోనే గొడవ వచ్చిందంటే కారణమేమిటని ప్రశ్నించారు. కడప జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టుకొని ఉండొచ్చుకదా అని అన్నారు. కుల సమీకరణం మీదే రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. కులాల మీదే వైసీపీ ఆట ఆడుతోందన్నారు. గొడవలు జరిగే వాతావరణం తెచ్చింది వైసీపీనే అన్నారు. రాష్ట్రానికి తొలి దళిత సీఎం అయిన దామోదరం సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి వచ్చిన కొంత మంది కర్నూలు కు సంజీవయ్య పేరు వద్దన్నారు…సంజీవయ్య అంటే గౌరవం లేక కాదు.. కర్నూలు కర్నూలులాగే ఉండాలనుకున్నారన్నారు.
ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేసేందుకే కోనసీమ గొడవ : పవన్ కల్యాణ్
Advertisement
తాజా వార్తలు
Advertisement