Tuesday, April 30, 2024

Khammam to Gannavaram – ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ

గన్నవరం, జూలై 2( ప్రభ న్యూస్) ఖమ్మం జన గర్జన సభలో పాల్గొని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి ఏపీ కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశ వివరాలను ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగిడుగు రుద్రరాజు వివరించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి, పోలవరం,స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటు పరం వంటి అంశాలను రాహుల్ గాంధీకి వివరించామని చెప్పారు.

జులై, ఆగష్టు లో విశాఖపట్నం లో సభలో పాల్గొంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ఉద్యమం లో భాగస్వామ్యం అవుతామని‌ చెప్పారన్నారు, పరిశ్రమ లు ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్ లు తొలగించాలని‌ బిజెపి కుట్ర చేస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా, పోలవరం అంశం పై రాహుల్ గాంధీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎపి కి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రకటించారు కాంగ్రెస్ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలని తమను రాహుల్ గాంధీ కోరినట్లు వెల్లడించారు. కాగా, ఖమ్మం నుంచి విజయవాడ వరకు దారి పొడవునా పలు ప్రాంతాల్లో ప్రజలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement