Saturday, May 18, 2024

నేడు సీఎం జ‌గ‌న్ తో మంత్రుల కీల‌క‌ భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పీఆర్సీ స‌మ‌స్య ఇప్ప‌టి వ‌ర‌కు కొలిక్కి రాలేదు. ఉద్యోగులు ఒక వైపు స‌మ్మెకు మొగ్గు చూపుతుండ‌డం, ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించ‌డం ఇలా జ‌రుగుతోంది. అయితే ఈరోజు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మంత్రుల క‌మిటీ కాసేప‌ట్లో కీల‌క‌ స‌మావేశం జ‌రుగ‌నుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నేడు కొలిక్కి వచ్చే అవకాశముంది. నిన్న మంత్రుల కమిటీతో సుదీర్ఘంగా చర్చించిన ఉద్యోగ సంఘాలు నేడు మరోసారి భేటీ అయి సమ్మె పై నిర్ణయం తీసుకోనున్నాయి. కాగా నిన్న సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన సారాంశాన్ని మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి జగన్ కు మరికాసేపట్లో వివరించనుంది.
మంత్రుల కమిటీ జగన్ తో భేటీ అయి ఉద్యోగులు పెట్టిన డిమాండ్లను వివరించనుంది. అయితే దాదాపు ఉద్యోగ సంఘాల డిమాండ్లలో అత్యధిక భాగం వాటిలో మంత్రుల కమిటీ నిన్న‌నే స్పష్టత ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీల పట్ల ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి చెందినట్లే కనిపిస్తుంది. చూద్దాం మ‌రి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement