Monday, April 29, 2024

Kesineni: టీడీపీకి మ‌రోషాక్‌… లోక్‌స‌భ‌,పార్టీకి రాజీనామా చేయ‌నున్న కేశినాని.. అదే బాట‌లో కూతురు శ్వేత‌

టీడీపీకి మ‌రోషాక్ త‌గిలింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్ సభ సభ్యత్వంతో పాటు, తెలుగుదేశం పార్టీకిసైతం రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం మరో సంచలన ట్వీట్ చేశారు.

తన కుమార్తె శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తుందని వెల్లడించారు. సోమవారం తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, రాజీనామా ఆమోదం పొందిన తరువాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని కేశినేని నాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement