Tuesday, May 7, 2024

వైభవంగా కార్తీక దీపారాధన..

కారంపూడి, (ప్రభ న్యూస్): కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వేంచేసి వున్న నగరేశ్వర స్వామికి వేద పండితులు బిల్వార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా శివపార్వతులకు శాంతి కళ్యాణం నిర్వహించారు. అంకాలమ్మ దేవాలయంలో సురేశ్వర స్వామి ఆలయంలో ఏకదాటి రుద్రాభిషేకం నిర్వసించారు.

ఇనపరాజ పల్లే గ్రామంలో నీలకంఠశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు శివ లింగాకారంలో ప్రమిదలతో ఏర్పాటు చేసి ద్వీపారాధోత్సవం చేశారు. తెల్లవారు జామున తల స్నానం ఆచరించి ఉపవాసాలు ఉండి కార్తీక ద్వీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి ప్రపతులను చాటుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement