Sunday, May 5, 2024

ఇది జ‌గ‌న్ బ‌రితెగింపే …చంద్ర‌బాబు అరెస్ట్ పై మండిప‌డ్డ క‌న్నా

గుంటూరు – సదుద్దేశంతో, గొప్ప లక్ష్యంతో గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై ఆదినుంచి జగన్ రెడ్డి అతని ప్రభుత్వం దురుద్దేశంతో నిరాధారఆరోపణలు చేస్తోందని, రాష్ట్రంలో సీబీసీఐడీ, సీఐడీ విభాగాలు సైకో ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తున్నాయని ప్రజలకు అర్థమైందని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారా యణ స్పష్టం చేశారు. …
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

“ ప్రభుత్వపరిధిలో ప్రజలకోసం నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన సీబీసీఐడీ, సీఐడీ.. ఇతర సంస్థలు కేవలం జగన్ రెడ్డి కక్షసాధింపుల వ్యవహారాల్లోనే మునిగితేలుతు న్నాయి. రాయలసీమ పర్యటనలో, ప్రజలమధ్యలో ఉన్న చంద్రబాబునాయుడి వద్దకు అర్థరాత్రి వెళ్లి అరెస్ట్ పేరుతో హంగామా చేయాల్సిన అవసరం ఏమిటో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

గిట్టని వాళ్లను జైళ్లకు పంపాలన్న జగన్ రెడ్డి కోరికలో భాగమే చంద్రబాబు అక్రమ అరెస్ట్…
జాతీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విషయంలో విచారణాసంస్థలు పరిధి దాటి వ్యవహరించాయనే చెప్పాలి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ రెండు బలమైన కోరికలతో పాలన సాగిస్తున్నాడు. ఒకటి ఎలాగైతే తాను గతంలో అవినీతి కేసుల్లో జైలుపాలయ్యాడో.. అదే విధంగా తనకు గిట్టనివారిని జైళ్లకు పంపడం. రెండోది భారతదేశంలోనే ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతులు పొందడం. తన కోరికలు తీర్చుకునే క్రమంలో అటు ప్రజల్ని దోపిడీ, అవినీతితో బలితీసుకుంటూ, ఇటు ప్రతిపక్షాలను తప్పుడు కేసులతో దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ముద్దాయి ఇచ్చిన ఆదేశాలతో అమాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించడం ఎంతమాత్రం సరైంది కాదు. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి పనిగట్టుకొని మరీ చంద్రబాబుని అరెస్ట్ చేయడాని కి వెళ్లినప్పుడే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసువిచారణ ఎంత పారదర్శకంగా జరిగిం దో స్పష్టమైంది. ఈ కేసులో సీబీసీఐడీ, ఏపీ ప్రభుత్వ అధీనంలోని విచారణాసంస్థలు తొలినుంచీ మేనిప్లేటెడ్ విచారణే జరిపాయని స్వయంగా న్యాయస్థానాల్లోనే రుజువైంది. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2లక్షల యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందారని, రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రాజెక్ట్ పరిధిలోని శిక్షణా కేంద్రాలు ఉత్తమ శిక్షణతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించాయని జగన్ రెడ్డి ప్రభుత్వమే గతంలో ప్రశంసలతో కూడిన నివేదిక ఇచ్చింది.

వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ రెడ్డి నేరుగా జైలుకే…

- Advertisement -

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ చేసిన అవినీతి, దోపిడీ బయటపడి, ఎక్కడ తనను ప్రజలు అసహ్యించుకుంటారోనన్న భయంతోనే జగన్ రెడ్డి, వైసీపీప్రభుత్వం చంద్రబాబు ని లక్ష్యంగా చేసుకొని కుట్రరాజకీయాలకు తెరలేపాయి. యువగళంతో లోకేశ్, ప్రజా బలంతో చంద్రబాబు తమ ప్రభుత్వ పునాదులు కదుపుతున్నారన్న భయంతోనే జగన్ రెడ్డి బరితెగించాడు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వ్యవహరిస్తున్న సైకో ముఖ్య మంత్రికి ప్రజలే బుద్ధిచెబుతారు. సైకో చెప్పిందానికి తలాడించి, పరిధిదాటి వ్యవహరిస్తు న్న అధికారులు కూడా భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ రెడ్డి సరాసరి జైలుకెళ్లడం ఖాయం. జగన్ రెడ్డి పైశాచి క వికృత చర్యలకు కర్రుకాల్చి వాతపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని కన్నా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement