Saturday, April 27, 2024

Kadiri – ఆటో – కారు ఢీ – ముగ్గురు స్పాట్ డెడ్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగుబ్బ మండలం ఎర్రదొడ్డి వద్ద ఎదురుగా వస్తున్న ఆటో- కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ మహిళ, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ముదిగుబ్బ మండలం మదిరేబైలు తండాకు చెందిన చిన్నస్వామి నాయక్, భాస్కర్ నాయక్, రెడ్డివారిపల్లితండాకు చెందిన చలపతి నాయక్ గా గుర్తించారు. మృతుల్లో చిన్నస్వామి నాయక్ మదిరేబైలు పంచాయతీ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement